మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

జగన్‌ సర్కార్‌కు షాక్.. ఆ జీవో వెనక్కు తీసుకోవాల్సిందే!

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 19-12-19
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

జగన్ సర్కార్‌కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. మీడియాకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 2430 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. పీసీఐ ముందు జర్నలిస్ట్ సంఘాలు, ప్రభుత్వం తమ వాదనలు వినిపించగా.. తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని జర్నలిస్టు సంఘాలు పీసీఐకు వివరించాయి.

జర్నలిస్ట్ సంఘాల వాదనలకు ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ జీవోను దుర్వినియోగం చేయబోమని.. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు వార్తల రాస్తే.. వాటి నియంత్రణ కోసమే ఈ జీవో తెచ్చామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న పీసీఐ ఛైర్మన్.. ఈ జీవో వెనుక జర్నలిస్టులను బెదిరించే ఉద్ధేశం కనిపిస్తోందని ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. ఆ జీవోను వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు.

ఫేక్ న్యూస్ సృష్టించినా.. వాటిని షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవంటూ 2430 జీవోను జగన్ సర్కార్ తీసుకొచ్చింది. నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పించారు. ఈ జీవోపై గతంలోనే జర్నలిస్ట్ సంఘాలు నిరసన తెలిపాయి. 

అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ జీవోపై ప్రతిపక్షం టీడీపీ నిరసన తెలిపింది. సభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించగా.. ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాసి నిందలు వేస్తే భరించాలా అంటూ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ జీవోతో ఎవరికీ నష్టం లేదన్నారు.. అబద్దాలు రాస్తే.. ఉన్నది లేనట్లుగా రాస్తే ప్రశ్నించే హక్కు ఉందని.. అవసరమైన కేసులు పెడతామని.. 2430 జీవో చదివితే తప్పు అని ఎవరూ అనరన్నారు. మరి పీసీఐ ఆదేశాలపై జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon