మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

Amaravati 29 గ్రామాల్లో రైతుల బంద్.. 144 సెక్షన్ అమలు

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 19-12-19
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

అమరావతిలో బంద్ జరుగుతోంది. మూడు రాజుధానులు ఉండొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను నిరసిస్తూ.. 29 గ్రామాల రైతులు బంద్ పాటిస్తున్నారు. స్కూళ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటల్స్ కూడా మూసివేశారు. అలాగే వెలగపూడిలోని సెక్రటేరియట్ దగ్గర రైతులు రిలే దీక్షలకు దిగారు. మిగిలిన గ్రామాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం నుంచి 29 గ్రామాల్లో గ్రామ సచివాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు.

Read Also: రాజధానిపై జగన్ ప్రకటన.. పవన్ కీలక నిర్ణయం

ఇదిలా ఉంటే అమరావతి ప్రాంతంలో సెక్షన్‌ 144, 34 పోలీస్ చట్టం అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. రైతులు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించాలని.. నిబంధనల్నిఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరసనలు చేసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడక్కడా భారీగా పోలీసుల్ని మోహరించారు.

బుధవారం నుంచి ఆందోళనలు చేస్తున్న రైతులు.. రాజకీయాల కోసం తమ జీవితాలతో ఆడుకోవద్దంటున్నారు. అమరావతిలోని మందడం, వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం రైతులు నిరసన చేశారు. మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అలాగే ఉద్దండరాయుని పాలెంలో అమరావతికి ప్రధాని మోదీ శిలాఫలకం వేసిన చోట రైతులు ఆందోళనకు దిగారు. మరి రైతుల ఆందోళనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon