మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

భీమా కోరేగావ్ కేసులో ఛార్జ్‌షీట్: రాజీవ్ తరహాలోనే మోదీ హత్యకు కుట్ర!

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 19-12-19
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

గతేడాది జరిగిన భీమా కోరేగావ్ అల్లర్ల ఘ‌ట‌నలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ కబీర్ కళా మంచ్‌కి చెందిన ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నినట్టు వెల్లడయ్యిందని మహారాష్ట్ర పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. మోదీ హత్యకు కుట్రపన్నినట్టు నిందితుడు రోనా జాకబ్‌ విల్సన్‌ ఇంట్లో సోదాలు చేస్తుండ‌గా ఓ లేఖ దొరికిందని పోలీసులు తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఎల్గార్ పరిషద్ కేసులో బుధవారం ఛార్జ్‌షీట్ దాఖలుచేసిన పోలీసులు.. మొత్తం 19 మందిపై అభియోగాలను నమోదుచేశారు.

వీరిలో మానవహక్కుల లాయర్లు, విద్యావేత్తలు, రచయితలు సహా తొమ్మిది మంది ఉద్యమకారులు ఉన్నారు. మొత్తం అభియోగపత్రాలను యూఏపీఏ జడ్జ్ ఎస్ఆర్ నవేందర్‌కు అందజేశారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ త‌ర‌హాలోనే నరెంద్ర మోదీని రోడ్ షోలో హత్యచేయడానికి కుట్ర పన్నినట్టు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఈ పథకం అమలుచేయడానికి అత్యాధునిక రైఫిల్స్ కొనుగోలుకు రూ. 8 కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని కూడా లేఖ‌లో ఉందని పోలీసులు తెలిపారు. నాలుగు లక్షల రౌండ్లతో కూడిన ఎం-4 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను నేపాల్, మణిపూర్ నుంచి సరఫరా చేసుకోవాలని కుట్రదారులు నిర్ణయించినట్టు వారు వివరించారు.

ఇది ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర‌ గానే నిఘావ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. మహారాష్ట్ర పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఈ కేసులో జనవరి 1లోపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. దేశంలో సామాజిక అశాంతి, అలజడులను సృష్టించడంలో భాగంగా డిసెంబరు 31, 2017 ఎల్గార్ పరిషద్ కార్యక్రమాన్ని సీపీఐ (మావోయిస్ట్) ఏర్పాటుచేసిందని, ఆ తర్వాత రోజే అంటే జనవరి 1, 2018న జరిగిన భీమా కోరేగావ్ అల్లర్లకు పురికొల్పేలా ప్రసంగాలు చేశారని పోలీసులు ఆరోపించారు.

గతేడాది జనవరి 6న ఈ కేసులో విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని పలువురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు. ఆరు నగరాల్లో 11 మంది ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో వరవరరావు, ఆయన కుమార్తెలు, స్నేహితుల ఇళ్లలో, ముంబైలో ఉద్యమకారులు వెర్నన్‌ గోన్సాల్వెజ్‌, అరుణ్‌ ఫెరీరా, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్‌, ఆమె కుమార్తె అను భరద్వాజ్‌, ఢిల్లీలో గౌతమ్‌ నౌలఖ, రాంచీలో ఫాదర్‌ స్టాన్‌ స్వామి, గోవాలో ఆనంద్‌ తేల్‌తుంబ్డే ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon