పానీపూరి టు కరోడ్పతి
క్రికెట్ ఆడేందుకు ఒకప్పుడు పానీపూరి అమ్ముకొని జీవనం సాగించిన యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ శ్రమకు ప్రతిఫలం దక్కింది.
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ 17ఏండ్ల సంచలన బ్యాట్స్మన్ను ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.2.40కోట్లకు సొంతం చేసుకుంది.
ముంబై ఇండియన్స్, కోల్కతా, పంజాబ్ జట్లు కూడా తీవ్రంగా ప్రయత్నించగా చివరికి యశస్విని రాజస్థాన్ దక్కించుకుంది.
ఉత్తర్ప్రదేశ్లో జన్మించిన జైస్వాల్ క్రికెట్పై ఇష్టంతో 11ఏండ్ల వయసులోనే ఇంట్లో నుంచి వచ్చేసి ముంబైలో ఓ టెంట్లో ఏండ్ల తరబడి తలదాచుకున్నాడు.
జీవనం కోసం పానీపూరీ అమ్మడంతో పాటు అనేక పనులు చేశాడు. అదే క్రమంలో ముంబైలోని ఆజాద్ మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ వివిధ టోర్నీల్లో సత్తాచాటాడు.
క్రమంగా ఎదుగుతూ దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది అక్టోబర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున 154 బంతుల్లోనే డజను సిక్సర్ల సాయంతో అలవోకగా ద్విశతకం బాదాడు.
లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ సీజన్ లిస్ట్-ఏ క్రికెట్లో 112బ్యాటింగ్ సగటుతో అతడు 564 పరుగులు చేశాడు.
వచ్చే ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 ప్రపంచకప్కు యశస్వి జైస్వాల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ‘
’చాలా ఆనందంగా ఉంది. రాజస్థాన్ ద్వారా ఎంత వీలైతే అంత నేర్చుకోవాలనుకుంటున్నా’ జైస్వాల్ అన్నాడు.